Thursday, April 17, 2025

రేపటి నుంచి జనగామలో మహాశివరాత్రి మహోత్సవాలు

రేపటి నుంచి జనగామలో మహాశివరాత్రి మహోత్సవాలు..

పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం.

ఆలయ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ..

గోదావరిఖని, ఫిబ్రవరి 25(తెలంగాణ నేత్రం)

 అతి ప్రాచీనమైన మూడు నిలువెత్తు శివలింగములతో అత్యంత ప్రాశస్త ల పవిత్ర గోదావరి నది సమీపము నందు గల  శ్రీశ్రీశ్రీశ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నేడు శివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ, దేవాలయ కమిటీ బాధ్యులు తెలిపారు.అత్యంత వైభవంగా  సంప్రదాయరీతిలో మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ మాట్లాడుతూ.. బుధవారం

ఉదయం 4 గంటలకు మంగళవాయిద్యాలతో స్వామి వారి మేలుకొలుపు, గణపతి పూజ ,స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరం తీర్థ ప్రసాద వితరణ మరియు రాత్రి గం||  12-05 ని॥ల వరకు అభిషేకములు, అర్చనలు, సాయంత్రం పార్వతి పరమేశ్వరుల రథోత్సవము నిర్వహించబడుతుంది. అనంతరం పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనున్నాయి.రాత్రి 9 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమములు,రాత్రి గం||  12-05 ని॥లకు లింగోద్భవ సమయములో స్వామి వారికి బిల్వ అష్టోత్రము,రాత్రి గం||  12-30 ని॥లకు స్వామి వారికి అభిషేకము

నిర్వహిస్తామని తెలిపారు.27 గురువారం రోజున మ॥  12 గంటలకు అన్నదానం కావున తామెల్లరు సకుటుంబ సమేతముగా విచ్చేసి, కోరిన కోర్కెలను తో కాశంకరుడైన ఆ దేవ దేవుడైన పరమశివుణ్ణి దర్శించి తమతమ జీవితాలను  ధన్యము చేసుకొని  , ముక్తిని పొందవలసినదిగా కోరారు. ఈ శివ రాత్రి మహోత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular